Description
పుస్తక పరిచయం :
భారతీయ సామాజిక వ్యవస్థకు, హిందూ దేవాలయాలకు మధ్యగల సంబంధం కేవలం ఆరాధనో లేక కట్టడ నిర్మాణమో మాత్రమే కాదు. సామాజిక స్పృహ, సాంఘిక జీవనం, సంస్కృతీ- సంప్రదాయాల పవిత్రత వంటి అనేక అంశాలు వీటితో ముడిపడి ఉన్నాయి. హిందూ దేవాలయ నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాకపోగా – వేల కోట్ల రూపాయల విలువైన దేవాలయ ఆస్తులు దోపిడీకి గురవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కల, కోట్ల భక్తులకు కొంగు బంగారమైన తిరుమల కూడా ఈ జాబితాలో ఉన్నదన్న విషయం ప్రతీ హిందువునీ ఆలోచించింప చేస్తుంది.
దేవాదాయ – ధర్మాదాయ ఆస్తుల పైన ప్రభుత్వ విధానం, అధికారుల నిర్లజ్జ వైఖరి- నిబద్ధతా రాహిత్యం, అన్యమతస్థుల ప్రాబల్యం వంటి అనేక విషయాలను రచయిత ఎండగట్టిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా దేవాలయ భూకబ్జాలు, నిర్వహణలో అవినీతి, అక్రమాలు, అడ్డగోలు పంపిణీల వంటి విషయాలను సోదాహరణంగా వివరించారు.
హిందువుల పరమ పుణ్య క్షేత్రమైన తిరుమలలో స్వామివారి ఆభరణాలు, ఖజానా లెక్కలు, అతిధి గృహాల నిర్వహణ వంటి వాటిలో అవకతవకలను, సాక్షాత్తు ఏడూ కొండల్లో భూ ఆక్రమణలు, దేవాలయ ఉద్యోగాల్లో ఇతర మతస్థులు మరియు నాస్తికుల నియామకం వంటి విషయాలను నిలదీసిన విధం ప్రతీ హిందువును జాగృతపరుస్తుంది. ప్రారంభంలో సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి సందేశం ఈ పుస్తకానికి అదనపు విలువనద్దింది.
హైందవం మతం మాత్రమే కాదు సంస్కృతీ స్వాభిమాన పరంపరగ భావించే ప్రతీ ఒక్కరు చదివి తీరవలసిన పుస్తకం ‘ తిరుమల ఫై ఎందుకీ కక్ష?, దేవాలయాల ఆస్తులు ఏమంటున్నాయి?’.
రచయిత పరిచయం
1936లో నెల్లూరులో జన్మించిన శ్రీ . సర్వేపల్లి వెంకట శేషగిరి రావు గణిత శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. 35 సం.ల పాటు ఉస్మానియా యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్, మాథెమటికల్ ఫిజిక్స్ లో పరిశోధనా పర్యవేక్షకులుగా పనిచేశారు. సైన్స్ పరిశోధనల రీత్యా దేశవిదేశాలు పర్యటించారు. సామాజిక, రాజకీయ విషయాలపైనా ఎన్నో వ్యాసాలు, గ్రంధాలూ వ్రాశారు. ‘ఎండ్ అఫ్ కమ్యూనిస్ట్ ఉటోపియా’, ‘పొలిటికల్ ఇస్లాం ఇన్ ఇండియా’, ‘మావోయిస్టు ఇన్సూర్జెన్సీ, ఏ పర్స్పెక్టివ్’ వారి కలం నుంచి వెలువడిన కొన్ని గ్రంధాలు.
Reviews
There are no reviews yet.