Description
హిందువులకు కొన్ని వందల ఏళ్ళుగా క్రైస్తవులతో పరిచయం ఉంది. హిందూదేశంలో క్రైస్తవులు నివసిస్తూ, మత ప్రచారం జరుపుతున్నారు. ఇంకా అనేక విధాలుగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇటీవలికాలంలో క్రైస్తవుల నుంచి హిందువులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. హిందూ-క్రైస్తవ సంబంధాలలో అనేక ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి.
హిందువులు క్రైస్తవుల మాటలకు, చేతలకు తమకు చేతనైన రీతిలో వ్యాఖ్యానించుకొని, అర్థం చేసుకొంటున్నారు. తమ అవగాహన మేరకు క్రైస్తవులతో వ్యవహరిస్తున్నారు. క్రైస్తవుల పట్ల హిందువుల అవగాహన సమగ్రమైనది కాదని అనేక సందర్భాల్లో ఋజువైంది. క్రైస్తవుల మాటలకు, చేతలకు హిందువులు చెప్పుకొంటున్న అర్థాలు సరైనవి కావని దేశంలో గతంలో జరిగిన ఇప్పుడు జరుగుతున్న అనేక సంఘటనలను బట్టి చెప్పవచ్చు. కాబట్టి హిందువులు క్రైస్తవమతాన్ని, క్రైస్తవమతగ్రంథాన్ని, క్రైస్తవ ప్రవక్తను గురించి మరింత నిర్దుష్టంగా తెలుసుకొనే ప్రయత్నం చెయ్యాలి. ఈ పుస్తకం అందుకు సహాయపడుతుంది. ఇప్పటి వరకూ హిందువులు క్రైస్తవ ప్రచారం ద్వారా మాత్రమే క్రైస్తవం గురించి తెలుసుకొని, ఆ ఎరుక మీద అభిప్రాయాలు ఏర్పరచుకొని, ఆ అభిప్రాయాల ఆధారంగా క్రైస్తవులతో వ్యవహరిస్తున్నారు. కాని క్రైస్తవ ప్రచారంలో నిజమెంత? నిజాయితీ ఎంత? వారు చెప్పేమాటలకు, చేసేపనులకు పొంతన ఉందా లేదా? ఒకవేళ వారి మాటలకు చేతలకు పొంతన లేనట్లు కనపడితే అందుకు కారణాలేమిటి? క్రైస్తవులు ఏ లక్ష్యంతో మన మధ్య పని చేస్తున్నారు? వారి చర్యలు, ప్రచారాల వల్ల మనకు కలిగే కష్టనష్టాలేమిటి? అనే విషయాలను హిందువులు తగినంతగా పట్టించుకోలేదు. అందువల్లనే పరిస్థితులు విషమించి, దేశంలో నలుమూలలా క్రైస్తవుల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించుకోవాలంటే ముందుగా క్రైస్తవమతాన్ని అర్థం చేసుకోవాలి.
Publisher : Samvit Prakashan ; Paperback ; Pages : 400 ; Author : Arindama


Reviews
There are no reviews yet.