Description
విదేశీ ఆక్రమణల సమయంలో ఈ దేశాన్ని తిరిగి శక్తిమంతం చేయలనే ఆలోచనలు ప్రారంభమై కార్యరూపందాల్చటం ఒక క్రమవికాసంలో జరిగింది సమాజంలో మేధాశక్తి, క్షాత్రశక్తి, – ఈ రెండు ప్రబలంగా ఉన్నప్పుడే సమాజం శక్తిమంతంగా ఉంటుంది. ముస్లిం ఆక్రమణల సమయంలో సమాజం అటువంటి మొదటి ప్రయత్నం దక్షిణాపథంలో జరిగింది. శృంగేరి పీఠాధిపతిగా ఉన్న విద్యారణ్య స్వామి తొలి శంఖారావం పూరించారు. దానితో శక్తిమంతమైన విజయనగర సామ్రాజ్య నిర్మాణం జరిగింది. దానికి ముందే దేశంలో ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఒక పరంపర నిర్మాణం అయింది. ఆ పరంపరలో రామానుజాచార్యులు, బసవేశ్వరుడు, మధ్వాచారు మొదలైనవారు ముందునడవగా, మొఘలుల పాలనాకాలంలో ప్రారంభమైన సంత్ పరంపరలో తులసీదాస్, రామానందుడు, రవిదాస్, సూరదాస్ కబీర్ దాస్, మీరాబాయి మొదలైనవారు, సమాజంలో సామాజిక జాగృతికోసం—పెద్ద ఎత్తున పనిచేశారు, వారిలో తులసీదాస్ రామాయణాన్ని “రామచరిత మానస్” పేరుతో రచించి ధర్మ సంరక్షణ మన అందరి కర్తవ్యం అని సమాజానికి గుర్తు చేశారు.
Publisher:Navayugabharathi ; Author :Rampalli Mallikarjuna Rao ; Paper Back; Pages : 104
Reviews
There are no reviews yet.