హిందూ ఈషాప్ బులెటిన్ – భాద్రపద మాసం – యుగాబ్ద 5124
- September 21, 2022
- 0 Comment(s)
హిందూ ఈషాప్ బులెటిన్ – భాద్రపద మాసం – యుగాబ్ద 5124
హిందూ ఈషాప్లో కొత్త పుస్తకాలు
మతం పేరుతో అక్రమాలు – న్యాయపోరాటానికి మార్గాలు
రెండు తెలుగు రాష్ట్రాల స్నేహితులు, హిందూ కార్యకర్తలు అనేక మంది అనేక సందర్భాల్లో ఇలాంటి ఒక పుస్తకం వ్రాస్తే బాగుంటుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల హిందూ కార్యకర్తలతో పాటు వివిధ గ్రామాల్లోని ప్రజలు తమకు ఎదురయ్యే సమస్యలపై తమకు తాముగా పోరాటం చేసేందుకు కావాల్సిన అవగాహన కలిగే విధంగా ఒక పుస్తకం వ్రాస్తే బాగుంటుందని అనేకసార్లు కోరడంతో ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాము. ప్రజలు తమకు ఎదురయ్యే సమస్యలపై న్యాయపోరాటం చేయడానికి న్యాయశాస్త్రం (లా) చదవాల్సిన అవసరం లేదు, దేశీయ చట్టాలపై కనీస అవగాహనా ఉంటే చాలు అని ఈ పుస్తకం చదివేవారికి అర్ధమవుతుంది. ఇది న్యాయ (లీగల్) పోరాటం చేసే వారిని దృష్టిలో పెట్టుకుని వ్రాసిన పుస్తకం.
క్రైస్తవ మతమార్పిళ్లపై పోరాటం అంశం ప్రధానంగా వ్రాసిన ఈ పుస్తకంలో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జరిపిన ప్రయోగాల గురించి మధ్యమధ్యలో ఉదాహరణలుగా వివరించడం జరుగుతుంది.
ఈ పుస్తకం చదివే పాఠకులకు, కార్యకర్తలకు గమనిక ఏమిటంటే, ఇందులో పొందుపరిచిన జీవోలు, చట్టాలు, నిబంధనలు కాలానుగుణంగా ఆయా పరిస్థితులను బట్టి, ప్రభుత్వాలను బట్టి మారే అవకాశం ఉంది.
అథర్వణ వేద పరిచయం
అధర్వణవేదపరిచయం పేరు కు తగ్గట్టుగానే ఇందులో అధర్వణవేదం పరిచయం చాలా సులభంగా సామాన్యులకు అర్థం అయ్యే సులభ భాషలో చెప్పబడింది.
అధర్వణవేదం పై ఉన్న అపోహలను ప్రశ్నల రూపంలో అడిగి వాటికి తర్కబద్దమైన, శాస్త్రబద్దమైన, సాంప్రదాయబద్దమైన సమాధానాలను మన ముందు ఉంచారు.
మేధాజననము , బ్రహ్మచారి సాంపదములు , రాజ కర్మలు,హోమా బంధన పాయానాది క్రియలు, లక్ష్మీకరములు, జన్మాంతర కృత పాప నిమిత్త చికిత్స వివిధ రోగభైషజ్యములు, స్త్రీ కర్మలు, శాంతి కర్మలు, పుష్టి కర్మలు, అభిచారికములు, ఉత్పాత శాంతులు, దానవ్రతాదులు జాతకర్మాదులు మొదలగు వాటి గురించి చక్కగా చెప్పబడినది.
కొన్ని పుస్తకాలు – మీ కోసం
ఒక నియంత తల వంచిన రోజు
నాటి హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వం, ప్రధానంగా మీర్ ఒస్మాన్ అలీ ఖాన్, కనుసన్నల్లో ఉన్న మజ్లిస్ ఇత్తేహదల్ ముస్లిమన్ సంస్థ సభ్యులైన రజాకార్లు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన మతోన్మాద చర్యలు, హత్యలు, హిందూ మహిళలపై చేసిన అత్యాచారాలు, విచ్చలవిడిగా గ్రామాల దోపిడీ, అంతులేని దౌర్జన్యాలు, అరాచకాలకు సంబంధించిన వివరాలను, సాక్ష్యాధారాలతో ఇందులో ఇవ్వడం జరిగింది. దాంతో పాటు నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమై ఆర్యసమాజ్, స్టేట్ కాంగ్రెస్, హిందూ మహాసభ, ఆంధ్ర మహాసభ, గ్రంథాలయోద్యమం లాంటి వివిధ రూపాలలో చేసిన ఉద్యమాలు, సోషలిస్టు, కమ్యూనిస్ట్ ల పాత్రకు సంబంధించి వివరాలను, అంతిమంగా సర్దార్ పటేల్ నేతృత్వంలో జరిగిన సైనికి చర్య లాంటి చారిత్రాత్మక ఘట్టాలను చిన్న చిన్న అధ్యాయాలుగా పొందు పరచడం జరిగింది. చరిత్రకు ఎలాంటి వక్ర భాష్యం లేకుండా నిజాం ప్రభుత్వపు మతోన్మాద నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి భాస్కర్ యోగి గారు రచించిన “సెప్టెంబర్ 17 – తెలంగాణ విమోచనం దినం ఒక నియంత తలవంచిన రోజు” పుస్తకం ఉపయోగపడుతుంది.
పెక్యూలరిజం
హిందూదేశంలో హిందువులు రెండో తరగతి పౌరులా ? భారత రాజ్యాంగం హిందువులకు వ్యతిరేకమా? మైనారిటీలకున్న రాజ్యాంగ హక్కులకు మెజారిటీ హిందువులు నోచుకోరా? ఎందుకీ వివక్ష ? ఎక్కడుంది లోపం? ఏమిటి దీనికి మూలం? మన వంకర సంకర విచిత్ర వ్యవస్థ పై ఎం.వి.ఆర్. శాస్త్రి విశ్లేషణ.
భారత దేశాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నాలు
ప్రపంచంలోని కొన్ని పాశ్చాత్య దేశాలు, ప్రముఖ క్రైస్తవ సంస్థలు కలిసి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి , వారసత్వ సంపద కలిగిన భారతదేశాన్ని ముఖ్యంగా స్థానిక హిందువుల అస్తిత్వాన్ని, నాగరికతను, శాశ్వితంగా అంతమొందించాలి అనే స్పష్టమైన లక్షం కుట్ర తో పని చేస్తున్న సంస్థలు, వారి కార్యకలాపాలను ఈ పుస్తకంలో కొంత వివరించడం జరిగింది. క్రైస్తవులు, క్రైస్తవేతరులు అంటూ ప్రపంచాన్ని విభజించి, ఆఫ్రికాలోని ప్రజలను నల్ల జాతీయులు, అనాగరికులు అని ముద్రించి వారిని ఉద్ధరించే పని కేవలం క్రైస్తవులదే అనే భావించే కొన్ని శక్తులు, అదే తరహాలో భారత దేశం సమాజంలోని వైవిధ్యాన్ని విభజనకు పునాదిగా మలచుకుంటూ చేస్తున కుట్రను బహిరంగ పరిచిన పుస్తకం ఇది.
మన పిల్లలకు హిందూ మతం చెప్పడం ఎలా?
21వ శతాబ్దంలో మతం గొడవ ఎందుకు? అని మనం అనుకోవచ్చు. ప్రపంచంలో అందరూ అలా అనుకుంటే చాలమంచిదే. కానీ ఇటీవల సామాజిక శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని గమనించారు. 20వ శతాబ్దం కమ్యూనిజం, మావోయిజం, హిట్లర్ సిద్ధాంతం, పెట్టుబడి విధానం మొదలైన సిద్ధాంతాల మధ్య పోరాటం కాగా 21వ శతాబ్దంలో మతం మళ్ళీ ముఖ్యవిషయంగా మారిందని వీరు చెబుతున్నారు. దీని కారణంగానే అనేక దేశాల్లో వివిధ మతాలకు చెందినవాళ్ళ మధ్య పోరాటాలు, అంతర్యుద్దాలు మొదలైనవి.
ఈ పుస్తకంలో హిందూమతం మొక్క మూలగ్రంధాలు పరిచయం చేయబడ్డాయి. మూలగ్రంధాలంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, వీటిలో మతము, వేదాంతశాస్త్రము రెండూ కలిసి ఉన్నాయి. వేదాంతానికి సంబంధించిన విషయాల్ని వీలైనంత సులభ భాషలో చెప్పడానికి ప్రయత్నం జరిగింది. అలాగే మూలగ్రంధాలకి ఆ తరువాత వచ్చిన ఇతిహాసాలు, పురాణాలకు ఎలాంటి సంబంధం ఉంది అనే విషయాన్ని కూడా చెప్పారు.