Description
About the book:
This is the Telugu translation of Bleeding India by Binay Kumar Singh.
Translated by Sri V.V.Subrahmanyam.
చరిత్ర మరోసారి పునరావృతమయ్యే స్థితి నేడు కనిపిస్తున్నది. 1857 విస్తృతమైన స్వాతంత్య్ర సంగ్రామం చెలరేగిన దరిమిలా ఆంగ్లేయుల ప్రోత్సాహంతో మహమ్మడెన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటుతో ఆరంభమైన కథ 1947లో దేశవిభజనతో పూర్తయింది. మొదట ముస్లింలలో విద్యావ్యాప్తికోసం అంటూ ఆ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ముస్లింలకు రాజకీయాలలో స్థానం కోసం అని ముస్లింలీగ్ను ఏర్పరిచారు. ఈ తర్వాత ముస్లింలవెనుకబాటు, ముస్లింలకు సమాన హక్కులు అంటూ అల్లరి మొదలుపెట్టారు. దాని ననుసరించి ప్రత్యేక నియోజకవర్గాలు, దాని ననుసరించి దేశవిభజన వచ్చాయి. ఇదే నాటకం సరిక్రొత్త పాత్రధారులతో మళ్లీ మొదలైనట్లు కనబడుతున్నది.
భారతదేశాన్ని ముక్కలు చేయటం, భారతీయ సంస్కృతిని తుడిచిపెట్టటం క్రొత్త నాటకానికి కనీస ఉమ్మడి కార్యక్రమం. ఈ ఉమ్మడి లక్ష్యాన్ని సాధించే ప్రయత్నానికి పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి.ఎఫ్.ఐ) వంటి ముస్లిం తీవ్రవాద సంస్థలు నాయకత్వం వహిస్తున్నయి. విధాన నిర్ణయాలకు రవాణా ఏర్పాట్ల నిర్వహణకు అర్బన్ నక్సల్స్ సహకరిస్తున్నారు. ఆర్థిక సహకారం, కార్యక్రమాల అజమాయిషీ క్రైస్తవ మిషనరీలద్వారా జరుగుతున్నది. చివరగా ఈ మూడు వర్గాలకు అందంగా ఉంటూ అన్నివేళలా ఆదుకొనే ప్రత్యేకమైన సహాయకబృందం ఒకటి ఉంది. ఈ బృందంలో కొందరు జర్నలిస్టులు, కొందరు న్యాయవాదులు, కొన్ని సాంస్కృతిక బృందాలు, మానవహక్కుల సంఘాలు ఉన్నవి. ఈ నాలుగు శక్తులూ నాలుగు గుఱ్ఱాలుగా పూన్చిన రథంగా వేగంగా దౌడుతీస్తున్నది. వీటి కార్యవ్యూహం మూడు+ఒకటి అనే రీతిలో ఉంటుంది. మొదటి మూడు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని అమలుచేస్తుండగా, నాల్గవది సైద్ధాంతికంగా సమర్థిస్తూ, సర్వవిధాలా సహకరిస్తూ, సంరక్షిస్తూ ఉంటుంది.
భారత కమ్యూనిష్టులు పాకిస్తాన్ ఏర్పాటుకు సహకరించినట్లుగానే ఈ దుష్టచతుష్టయానికి సహకరిస్తున్నారు. పత్తల్గడి, భీమా-కోరేగావ్ సంఘటనలు, మీరట్ మతకలహాలు, సిఏఏ. వ్యతిరేక ఉద్యమం ఇవన్నీ క్రైస్తవ మిషనరీలు, అర్బన్ నక్సల్స్, పి.ఎఫ్.ఐ కూటమి సమన్వయ – వ్యవహారాలకు తిరుగులేని నిదర్శనాలు. హత్రాన్లో దళిత బాలిక సామూహిక అత్యాచారం హత్యలకు నిరసన ప్రకటనలో వీరు వ్యవహరించిన తీరుకూడా దుష్టచతుష్టయం. సాగించే కుతంత్రానికి నిదర్శనం. వీరు చేసిన ప్రయత్నాలలో విదేశీనిధుల వినియోగం, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి ప్రభుత్వేతర సంస్థల హస్తక్షేపం, పి.ఎఫ్.ఐ తదితర సంస్థల జోక్యం ఇవన్నీ ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రాథమిక పరిశీలనలో వెల్లడైనాయి.
పి.ఎఫ్.ఐ.ఇతర ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు, అర్బన్ నక్సలైట్లు, క్రైస్తవ మిసనరీలు, వాళ్లకు అండదండలుగా ఉన్న మేధావులు బృందాలు వీళ్ల కార్యకలాపాలు ఈ గ్రంథంలో విశ్లేషించబడినవి. తాజా సమాచారము, నివేదికలలోని అంశాలు జోడించబడినవి. దీనిని చదివే నిష్పాక్షిక పాఠకులు ఈ చతుష్టయం భారతీయ సమాజానికి, దాని సంస్కృతికి ముప్పు అవునో కాదో, తామే నిర్ణయించుకోగలరు.
Publisher : Navayuga Bharati ; Pages : 197 ;
Reviews
There are no reviews yet.