Description
పుస్తక సంక్షిప్త పరిచయం :
హైదరాబాద్ సంస్థానంలో ఉన్న 88శాతం హిందువులపై నిజాం, అతని ఖాక్సర్ పార్టీ దమనకాండకు పాల్పడ్డాయి. ఆ దమనకాండలో నిజాం సైన్యం, ఇత్తెహాదుల్ ముస్లిమీన్, రోహిలా, పఠాన్, అరబ్ లు పాలుపంచుకున్నారు. ఈ దమనకాండ 1920లో ప్రారంభమై ఆ తరువాత క్రమంగా పెరిగింది. 1938నాటికి పరిస్థితులు భయానకంగా మారాయి. తమ బాధలు, కష్టాలను చెప్పుకునేందుకు కూడా హిందువులకు అనుమతి లేదు. అన్యాయ, నియంతృత్వ నిజాం పాలనకు వ్యతిరేకంగా నిరాయుధ ప్రతిఘటన తప్ప హిందువులకు మరొక మార్గం లేకపోయింది.
Samvit Prakashan ; Paperback ;
రచయిత పరిచయం :
డా. శ్రీరంగ్ గోడ్బోలే
పూనాలో నివాసం. మధుమేహం, హార్మోన్ వ్యాధి నివారణ నిపుణులు. మధుమేహ వ్యాధి గురించిన రెండు పుస్తకాల సహ రచయిత. జిహాద్, ఇస్లాం అంతర్ దర్శనం, మతపరమైన జనసంఖ్య, భౌద్ధం-ఇస్లాం సంబంధం, స్వతంత్ర వీర సావర్కర్ శౌర్యగాధ వంటి విషయాలపై మరాఠీ భాషలో గ్రంధాలు రచించారు. విప్లవ వీరులు బాబారావ్ సావర్కర్ గురించి ఆంగ్లంలో ఆన్ లైన్ చరిత్ర రచన. `యుగప్రవర్తక్ డా. హెడ్గేవార్’, `ద్రష్ట సంఘటక్ బాలాసాహెబ్ దేవరస్’ వంటి సంకలనాలకు సంపాదకులు. `శుద్ధి ఆందోలన్ కా సంక్షిప్త్ ఇతిహాస్: 712 సే 1947 తక్’, `ఈసాయియత్: సిద్ధాంత్ ఏవం స్వరూప్’ మొదలైన హిందీ పుస్తకాల రచయిత. అనేక వర్తమాన విషయాలపై వ్యాసాలు వ్రాసారు. www.savarkar.org , www.golwalkarguruji.org అనే రెండు వెబ్ సైట్ ల రూపకల్పనలో కూడా పాలుపంచుకున్నారు.
Reviews
There are no reviews yet.