Description
కె.జి. క్లాసు నుండీ కూడ ఆంగ్ల భాషాభ్యాసం అనివార్యమని పాలకులు నిర్ధారించారు.
పెదవుల కదలికతో మాత్రమే చేయవలసిన ఆంగ్లభాషోచ్చారణలోని సౌష్టవానికి అన్ని అక్షరాలూ స్పష్టంగా పలకవలసిన సంస్కృతాంధ్రభాషలలో సహజంగా ఉండే సుస్పష్టోచ్చారణ ఎక్కడ విఘాతకం అవుతుందో అను శంక చేత ఇతర మతస్థులు వాళ్ళ ప్రైవేటు పాఠశాలలోను, ప్రార్థనా మందిరాదులలో
నిరంతరము నేర్పుతూన్న పాఠాలకు భిన్నంగా విశాల దృక్పథంతో ఉన్న పాఠాలు నేర్పితే
వాళ్లకు మనస్తాపము, తమ పదవులను కుదిపివేసే ఆగ్రహము ఎక్కడ వస్తాయో అను భయం చేతా
ఈనాడు రామాయణ భారతాది గ్రంథాలు పాఠశాలా పాఠ ప్రణాళిక నుండి పూర్తిగా తొలగించి వేయబడినవి.
శ్రీ మద్రామాయణ మహాభారతాలలోని సూక్తుల చయనం అనగా “నాలుగు దోసిళ్ల ఉత్తమజాతికి చెందిన ముత్యాలు ఎదుట పోసి వీటిలో నుంచి పది మంచి ముత్యాలు ఏరమనడం వంటిది.
విద్యాసంబంధి కార్యాలలో ఉత్సాహమూ చేయవలసిన ఆంగ్లభాషోచ్చారణలోని మాత్రమే చేయదగిన పని ఈ చక్కని సూక్తుల సముచ్చయనం.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో ప్రొఫెసర్గా, విభాగాధ్యక్షురాలుగా పని చేసిన డా. పి. శశిరేఖ గారు భారతం నుంచి దాదాపు 450 సూక్తులు సేకరించి. , “భారత సూక్తి సుధాబిందువులు” అను పేరుతో ప్రచురించినారు ప్రతిదివసము నందు భగవతార్ధనాది ప్రాతః కాలకర్తవ్యములు ముగించుకొని ఏతాదృశ సూక్తి సముచ్చయ – భగవద్గీతాదులలో ఏ ఒక్క గ్రంథం నుంచి యైనా నాలుగైదు శ్లోకాలు చదివి, వాటి అర్థం భావన చేస్తూ దైనందిన వ్యవహారోద్యుక్తులైనవారు, నిరంతరోత్సాహభరితులై నిరాశా నిస్పృహలకు లోను కాకుండా సుఖమైన జీవితాన్ని గడప గలరు.
Reviews
There are no reviews yet.