తిరుమల ఫై ఎందుకీ కక్ష?, దేవాలయాల ఆస్తులు ఏమంటున్నాయి? Tirumalapai enduku kaksha
దేవాలయ నిర్మాణం ఎంతో కష్టతరమైన వ్యవహారం. అది ఇటుక సున్నంలతో నిర్మితమైయ్యే కట్టడం కాదు. దేవాలయ నిర్మాణానికి పవిత్రత మూలాధారం, స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ దేవాలయాలకు ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయడంలేదు. ప్రభుత్వ సహాయాన్ని ప్రజలు ఆశించడమూలేదు. ఇటువంటి పరిస్థితిలో సెక్యులర్ రాజ్యవ్యవస్థలో, ఒక మతానికి చెందిన ధార్మిక సంస్థలకు సంబంధించిన పాలనా నిర్వహణపై ప్రభుత్వం చట్టం చెయ్యొచ్చా? అంటూ రచయిత ప్రశ్నించిన తీరు పాఠకులను ఆలోచింపచేస్తుంది.
కుహనా సెక్యూలర్ ప్రభుత్వ విధానాల వలన కోట్ల విలువ చేసే ఆస్తులు తీవ్ర సంక్షోభంలో మునిగిపోతున్నాయి. దీనికి ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కల, కోట్ల భక్తులకు కొంగు బంగారమైన తిరుమల కూడా మినహాయింపు కాదు. తిరుమలలో స్వామివారి అమూల్య ఆభరణాలు, ఖజానా లెక్కలు, అతిధి గృహాల నిర్వహణ వంటి వాటిలో అవకతవకలను, సాక్షాత్తు ఏడూ కొండల్లో భూ కబ్జాలను , దేవాలయ ఉద్యోగాల్లో ఇతర మతస్థులు మరియు నాస్తికుల నియామకం వంటి అనేక విషయాలు ఇందులో గణాంకాల సహితంగా చర్చింపబడ్డాయి. ఇవి ప్రతి హిందువు తెలుసుకుని జాగృతమవ్వవలసిన అంశాలు. ప్రారంభంలో సద్గురు శ్రీ. శివానంద మూర్తి గారి సందేశం ఈ పుస్తకానికి అదనపు విలువనద్దింది.హైందవం మతం మాత్రమే కాదు సంస్కృతీ స్వాభిమాన పరంపరగా భావించే ప్రతీ ఒక్కరు చదివి తీరవలసిన పుస్తకం ‘ తిరుమల ఫై ఎందుకీ కక్ష?, దేవాలయాల ఆస్తులు ఏమంటున్నాయి?’.
Flight of Deities and Rebirth of Temples: Episodes from Indian History ( HB )
Flight of Deities and Rebirth of Temples: Episodes from Indian History ( HB )
About the Book : This work examines the medieval response to temple destruction and image desecration. …