Description
పుస్తకం గురించి :
సంక్షిప్త భారత దేశ చరిత్ర – సంస్కృతి – వేదకాలం నుంచి 1947 వరకు
ఇది చరిత్రకు సంబంధించిన పాఠ్యగ్రంథం కాదు. ఇది కేవలం భారతదేశ చరిత్ర, సంస్కృతులను గురించి తెలుసుకోవాలనుకొనే ఆసక్తి వున్న వారి కొరకు రూపొందించబడిన సంక్షిప్త పరిచయం. ఈ రచనకు వుపయోగపడిన ఆధారాలు వివిధ గ్రంథాల్లో లభించేవే. ద్వితీయ శ్రేణికి సంబంధించిన ప్రామాణికమైనవి. అయితే ఆయా రచయితల తర్కం, వ్యాఖ్యానాలు మాత్రం వడబోయబడ్డాయి.
ఇటీవలి కాలంలో న్యూక్లియర్ ఫిజిక్స్, అంతరిక్ష విజ్ఞానం ముందుకు దూసుకు పోతున్నాయి. భౌతికశాస్త్రంలోని నూతన ఆవిష్కరణలు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు చరిత్రలోని అనేక జటిల సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలను చూపుతున్నాయి. ఇంకిపోయిన వేదకాలం నాటి సరస్వతి నది ఆనవాళ్లను, రామసేతు ఆనవాళ్లను ఉపగ్రహ ఛాయాచిత్రాలు స్పష్టంగా చూపుతున్నాయి. సముద్రంలో మునిగిపోయిన ద్వారక శిథిలాలను మారైన్ ఆర్కియాలజీ చిత్రాలు వెలుగులోకి తెచ్చాయి. ఈ గ్రంథంలో ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలకు అత్యంత ప్రాధాన్యత నివ్వడం జరిగింది..
రచయిత గురించి....
సర్వేపల్లి వెంకట శేషగిరిరావు 1936లో నెల్లూరులో జన్మించారు. విద్యాభ్యాసం ఆర్ కాలేజీ (నెల్లూరు), ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్), ఐఐటి (ఢిల్లీ) లలో జరిగింది. 30 సం|| పాటు ఉస్మానియా యూనివర్సిటీలో మాథమెటిక్స్, జియోఫిజిక్స్ |
బోధించారు. రీసెర్చ్ పర్యవేక్షించారు. 1974లో మాస్కో జియొలాజికల్ ప్రాస్పెక్టింగ్ ఇన్స్టిట్యూట్లో సోవియట్ శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు జరిపారు. 1977లో యునెస్కోకు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థీరెటికల్ ఫిజిక్స్ (టీయెస్టీ -ఇటలీ)లో గెస్టు సైంటిస్టుగా పరిశోధనలు చేశారు. 50కి పైగా వారి రిసెర్చి పేపర్స్ అంతర్జాతీయ, జాతీయ సైన్స్ జర్నల్స్ ప్రచురితమైనాయి. ఇంకోవైపు సామాజిక, రాజకీయ విషయాలపై ఎన్నో వ్యాసాలు, గ్రంథాలు, తెలుగులోను, ఆంగ్లంలోను వ్రాశారు. “End of Communist Utopia”, “Political Islam in India”, “India’s Ocean Neighbourhood” వారి కలం నుంచి వెలువడిన గ్రంథాలలో కొన్ని.
2008లో సనాతనధర్మ చారిటబుల్ ట్రస్టు (భీమునిపట్నం) వారిని ‘Eminent Citizen Award’ తో సత్కరించింది. ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, కాసర్ గోడ్ ఛాన్సలర్గా వున్నారు.
ప్రచురణ : ఇతిహాస సంకలన సమితి (భారతీయ) తెలంగాణ ; Hardcover; Pages : 688 ;
Reviews
There are no reviews yet.