Description
గ్లోబల్ వార్మింగ్, అంటార్కిటికా వద్ద పెద్దమొత్తంలో మంచు కరగడం, సముద్రమట్టం పెరుగుదల, అణుకాలుష్యం, వాయుకాలుష్యం, భూమిని బరువెక్కిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు వంటి విషయాలపై శాస్త్రీయపరమైన లోతైన విశ్లేషణ ఈ గ్రంథంలోని వివిధ వ్యాసాలలో ఇవ్వబడింది.
పర్యావరణ కాలుష్యం గురించి, తద్వారా ఉత్పన్నమౌతున్న దుష్పరిణామాల గురించి శాస్త్రీయంగా పరిశోధనాత్మక అధ్యయనం చేయ్యాలనుకునేవారికి ఈ పుస్తకం ఒక కరదీపిక.
పర్యావరణం గురించి రచయిత జరిపిన మూడు సంవత్సరాల సుదీర్ఘ అధ్యయనం “పర్యావరణమా? పర్యామరణమా?” పేరుతో పుస్తకంగా వెలువడింది. ఇందులో 34 అధ్యాయాలున్నాయి.
- Inter-governmental Panel on Climate Change (IPCC)
- Nature Climate Change, World Food Programme
- Human Rights Watch, United Nations Environment Programme
- Inter-governmental science Policy Platform on Biodiversity and Ecosystem Sciences (IPBES).
వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పర్యావరణం గురించి సుదీర్ఘకాలం జరిపిన పరిశోధనల అధ్యయనం ఆధారంగా తెలుగులో వెలువడిన మొట్టమొదటి గ్రంథం ఇది.
Pages : 201; Language : Telugu ;
పుస్తక రచయిత పరిచయం:
ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిశోర్ విశాఖపట్నంలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్. వీరు ఆంద్ర విశ్వవిద్యాలయంలో , M.Tech (Computer Science) చేసి, హైదరాబాద్ JNTU నుండి Ph.D, పొందారు.
వీరి ప్రధాన ఆసక్తి పుస్తక పఠనం, రచనలు చేయడం. గత ముప్పై ఏళ్ళుగా వివిధ దిన, వార, మాస పత్రికలలో వివిధం అంశాలపై వీరు చేసిన రచనలు ఎన్నో ప్రచురితమయ్యాయి.
Reviews
There are no reviews yet.