Description
పుస్తకం గురించి
భారతదేశంలోగాని, బయటగాని అచ్చుకాబడిన ఈరకం పుస్తకాలలో ఇదే మొదటిది. అయినప్పటికీ రచయిత తాను తేల్చిచెప్పిన విషయాలను బలపరచడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో లబ్ధప్రతిష్ఠులైన రచయితలు, మేధావులు, విద్వాంసులు చెప్పిన వాటిని ఉదాహరించడం ద్వారా ప్రత్యేక ప్రయత్నం చేశారు. పరమేశ్వరన్ గారు భారతీయ విచారధారలో మూలాలు గల పరిశోధకుడు. చదువరులను అన్నిటికన్నా ఎక్కువగా ఆకట్టుకొనేది ఈ ఇద్దరు ప్రవక్తల సిద్ధాంతాలు, వ్యక్తిత్వాల, ప్రభావాల గురించిన విశ్లేషణ. అయితే మార్క్సిజం యొక్క బలహీనతను, స్వామీజీ వేదాంతపు ఔన్నత్యాన్ని విశ్లేషణాత్మకమైన రీతిలో బట్టబయలుగా ప్రదర్శించి వాటి మధ్యగల భేదాలను వివరించారు. పుస్తకం ఆద్యంతాలూ ఆయన విషయప్రధానమైన, విద్యాలయోచితమైన వైఖరిని అవలంబించారు.
ఈ పుస్తకపు రచనారీతిని జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ తన మున్నుడిలో ఈ విధంగా సముచిత రీతిలో వివరించారు. “రాటుదేలిన సాంస్కృతిక ఉద్యమకారుడై ఉండి, వామపక్ష భావజాలంతో మంచి పరిచయం ఉన్నా, దానికి బద్ధుడుకాని, ఈ రచయిత ప్రాచ్య ఆధ్యాత్మిక సెక్యులరిస్టు తుఫాను అయిన వివేకానందుడు, పాశ్చాత్య భౌతిక మానవతా వాదపు తుఫాను అయిన కారల్ మార్చ్ కథానాయకులై ఉన్న ఒక తులనాత్మక పరిశీలనాంశాన్ని చేపట్టి నిర్వహించారు.”.
Reviews
There are no reviews yet.