Description
పుస్తకం లో :
కథలంటే పిల్లలు చెవి కోసుకుంటారు. ఎందుకు? కథలలో తమలో గల లేదా తమకు నచ్చిన గుణగణాలు గల పాత్రలు వారికి తారసిల్లుతాయి కనుక. ఆ పాత్రలు జంతువులు, పక్షులు కావచ్చు, సాహసాలు చేసే రాజకుమారుడు కావచ్చు, లేదా మహాత్యాగమూర్తులయిన శిబి, దధీచి వంటివారు కావచ్చు. క్లిష్ట సమయాలలో ఎలా ప్రవర్తించాలో, ఎలా బ్రతకాలో లేదా అసలెందుకు బ్రతకాలో ఆ పాత్రలు మాట్లాడకుండానే చెప్తాయి. ఆ విధంగా వింటున్న పిల్లవానికి కథ జీవిత దర్పణంలా ఉంటుంది.
శిశువులకు, బాలురకు మనస్సు భావప్రధానంగా ఉంటుంది. సంస్కారాలను గ్రహించేదిగా ఉంటుంది. ఇది ప్రపంచమంతటా అంగీకరింపబడిన విషయం. శిశువులకు గాని, బాలురకు గాని 3-14 ఏండ్ల ప్రాయంలో ఏయే విషయాలు మనస్సులో చోటుచేసుకుంటాయో అవే వారి స్వభావాన్ని తీర్చిదిద్దడానికి పునాది రాళ్ళవుతాయి. ఇందువల్లనే అన్ని కాలాల్లో, అగ్ని దేశాలలో సౌశీల్య నిర్మాణ ప్రక్రియకు అత్యంత శ్రద్ద వహించబడుతోంది. ఈ దిశలో కథాసాహిత్యానికి అన్నింటి కంటే ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. కథల ద్వారా పిల్లలకు ఆచరణాత్మక మార్గదర్శనం లభిస్తుంది.
ఈ “కథాసుధ-1” పుస్తకంలో నలభై కథలున్నాయి. ఇవన్నీ ఒకటి లేడా రెండు పూతల నిడివి కలవి. మహనీయుల జీవితాలలో స్ఫూర్తిదాయకమైన ఘట్టాల ఆధారంగా రూపొందినవే ఈ కథలన్నీ. పిల్లలనే కాదు, పెద్దలను కూడా అలరిస్తూ జీవితం పట్ల తగిన మార్గదర్శనం ఇస్తాయి ఈ కథలు.
Pages : 64; Publisher : Shikshan Mandal
పుస్తక రచయిత పరిచయం:
ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిశోర్ విశాఖపట్నంలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్. వీరు ఆంద్ర విశ్వవిద్యాలయంలో , M.Tech (Computer Science) చేసి, హైదరాబాద్ JNTU నుండి Ph.D, పొందారు.
వీరి ప్రధాన ఆసక్తి పుస్తక పఠనం, రచనలు చేయడం. గత ముప్పై ఏళ్ళుగా వివిధ దిన, వార, మాస పత్రికలలో వివిధం అంశాలపై వీరు చేసిన రచనలు ఎన్నో ప్రచురితమయ్యాయి.
Reviews
There are no reviews yet.