Description
సంక్షిప్త పరిచయం :
భారతదేశం తనకెదురవుతున్న సవాళ్ళను గుర్తించి, సమర్ధవంతంగా ఎదుర్కొనడం కొన్ని
వర్గాలకు, కొన్ని దేశాలకు ఇష్టంలేదు, “చైతన్యులైన భారతీయులను, భారతదేశాన్ని చూసి
ఎవరు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు?” అని విశ్లేషించుకోవటం ఎంతైనా అవసరం.
భారతదేశంలోని కుండలినీశక్తి జాగృతమైంది. స్వాభిమానంతో నలువైపులా తన
ప్రతిభాపాటవాలను ప్రసరిస్తున్నది. అవసరమైనవారికి తగురీతిలో చేయూత నందిస్తున్నది. భారతదేశం విశ్వగురువుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోబోతున్నది. ఈ పరిణామాలను చూసి బెంబేలెత్తుతున్నదెవరు?
పాశ్చాత్యదేశాలలో వలసపాలన, దోపిడీలే పునాదులుగా బలిసిన పెట్టుబడిదారులు, తమ పరోక్ష ఆర్థిక వలసపాలనను ఎల్లలు లేకుండా దేశదేశాలలో విస్తరింపచేసుకున్నారు. ప్రజల మద్దతుతో దేశదేశాలలో ఎన్నికైన ప్రభుత్వాలను సైతం డబ్బు బలంతో పడగొట్టి, తమ కీలుబొమ్మలను పాలకులుగా ప్రతిష్టించగల స్థాయికి ఎదిగారు. ఆర్థికశక్తి, విశ్వవిద్యాలయాలు, ప్రసారసాధనాలు, ప్రభుత్వాలు కూడా వారి కనుసన్నలకు నాట్యం చేస్తున్నవి. కానీ వలసవాద సంకెళ్లను తెంచుకొని ఎదుగుతున్న భారతదేశపు ప్రగతి వారిని భయపెడుతున్నది. అందుకని భారతదేశాన్ని ఎదగనీయకుండా అనేక అవరోధాలను సృష్టిస్తున్నారు. కృత్రిమమేధ, బిగ్ డేటా ఆధారంగా వారు రూపొందిస్తున్న డిజిటల్ కాస్ట్ సిస్టం ప్రపంచానికి పెద్ద ప్రమాదకారి కానున్నది. ఆ కారణంగా అట్టడుగువర్గాలు శాశ్వతంగా పేదరికంలో మగ్గుతారు.
ఐదు శతాబ్దుల క్రితం వ్యాపారం కోసం తనదేశానికి వచ్చిన పోర్చుగీసులు ఇక్కడ మన సమాజంలో వర్ణవ్యవస్థ ఉందని విన్నారు. తమ యూరప్ సమాజంలో జన్మతః ప్రాప్తిస్తుండే కాశిని మన సమాజానికి ఆపాదించి చేసుకొనేందుకు యత్నించారు. ఆ తర్వాత వందేళ్లకు వచ్చిన ఆంగ్లేయులు పోర్చుగీసులు. వ్రాసిపెట్టిన గ్రంథాలనుండి, వ్రాతలనుండి తమకు అరకొరగా అర్ధమైన విషయాలను గ్రంథస్థం చేసి, వాటి ఆధారంగా చట్టాలను రూపొందించారు. జనాభాలెక్కలు తీశారు. విభజించి పాలించటంతో కృతకృత్యులయ్యారు. ఈనాడు మనం చూస్తున్న కాస్ట్ వ్యవస్థ అంతా వారి చలమే
వర్ణాశ్రమధర్మాల ఆధారంగా ఏర్పడిన సామాజిక వర్ణవ్యవస్థ కాలక్రమంలో అనేక మార్పులకు లోనైనా, ఆ పేరుతోనే విలువబడ్డది. ఈ వ్యవస్థ దేశకాల పాత్రాలతో ఏకరీతిగా లేకపోయినప్పటికీ, అనేక ప్రాంతాలలో ఆ వ్యవస్థ ఎప్పుడో కుప్పుకూలినప్పటికీ, ఆ మిగిలిన కొద్దిపాటి ఆచారాలకు యూరోపియన్లు కొత్త అవగుణాలను జోడించి కాస్ట్ వ్యవస్థ అని నామకరణం చేసి, ప్రపంచంలోని జాతి విద్వేషాలకు ‘కాస్ట్’ మూలకారణం అనే అభియోగాన్ని మోపి, యోగిక భారతదేశాన్ని, సనాతనధర్మాన్ని, ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టేందుకు చేస్తున్న కుతంత్రాలను ఈ పుస్తకం బట్టబయలు చేస్తుంది.
సౌదీ అరేబియా, చైనా, అమెరికా, వోకి పెట్టుబడిదారీ వర్గం, ప్రపంచ వామపక్షం ఒక అపవిత్ర కూటమిగా ఏర్పడి, LGBTQ, వోణిజం, కేన్సిల్, కల్చర్ తమ ఆయుధాలుగా భారత సమాజంలో ఎలా వచ్చు. పెట్టుతున్నారో, దేశవిచ్ఛిన్నకరశక్తులకు హార్వర్డ్ శిక్షణాకేంద్రంగా ఎలా వినాశకరపాత్రపోషిస్తున్నదో ఈ పుస్తకంలో సవివరంగా చర్చించారు.
“బ్రేకింగ్ ఇండియా” రచయిత రాజీవ్ మల్హోత్రా, విజయవిశ్వనాథన్తో కలిసి చేసిన విస్తృత పరిశోధనల ఫలితంగా 860 పుటలతో, 63పుటల ఎండ్ నోట్స్, 59 పుటలు ఉపయుక్త గ్రంథసూచీతో ఆంగ్లంలో వెలువడిన ఉదంతం Snakes in the Ganga” యొక్క సంక్షిప్తరూపమే ‘గంగలో విషనాగులు’ అనే ఈ పుస్తకం. యోగిక భారతదేశాన్ని ఒక నాగరికతారాజ్యంగా ఎదగనీయకుండా, దాని సాంస్కృతిక మూలాలను పెకలించే ప్రయత్నాలు చేస్తున్న దేశవిచ్ఛిన్నకర శక్తుల విషయమై హెచ్చరించడమే ఈ పుస్తకపు లక్ష్యం.
ISBN : 978-81-960217-7-1 ; Samvit Prakashan ; Paperback ; Pages : 300 ;
Authors : Rajiv Malhotra and Vijaya Viswanathan ;
Translated by : Dr. Sarangapani and M. Sudha Mohan
Reviews
There are no reviews yet.