వేదాంత సార : Vedanta sara
సంస్కృతభాషతో ఎన్నో సహస్రాబ్దులనుంచి వివిధ విషయాలకు సంబంధించిన అనేక శాస్త్రాలు ప్రచారంలో ఉన్నాయి.
ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక సముద్రం వంటిది. హఠాత్తుగా వాటి మధ్యలో ప్రవేశించడం ఎవరికీ కూడ సాధ్యం కాని విషయం.
వాటిలో ప్రవేశానికి కొన్ని ద్వారాలు, మార్గాలు ఏర్పరచుకోవాలి. దిలీపమహారాజు కుమారు డైన రఘువు లిపిని అభ్యసించడం
ద్వారా వాఙ్మయంలోనికి, నదీముఖం ద్వారా సముద్రంలో ప్రవేశించి నట్లు ప్రవేశించాడు అని మహాకవి కాళిదాసు వర్ణించాడు:
చాల కాలంనుండి శాస్త్ర చతుష్టయం అను పేరుతో ప్రసిద్ధిలో ఉన్న క్లిష్టమైనసువిశాలమైన శాస్త్రాలు న్యాయ వ్యాకరణ పూర్వమీమాంసా-ఉత్తర మీమాంసా శాస్త్రాలు.
ఉత్తరమీమాంసా శాస్త్రానికి వేదాంతశాస్త్రం అని పేరు. వేదాంతశాస్త్రంలో ప్రధానంగా అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం అను మూడు సంప్రదాయాలు ఉన్నాయి.
ఒక్కొక్క సంప్రదాయానికి సంబంధించి అతివిస్తృత మైన వాఙ్మయం ఉంది.
ఈ శాస్త్రాలలో అనాయాసంగా ప్రవేశం కల్పించడానికై ఎందరో మహాపండితులు ఆ యా కాలాలలో సిద్ధాంతమాత్ర ప్రతిపాదనపరా లైన అనేక లఘు గ్రంథాలు, ప్రకరణగ్రంథాలు రచించారు.
అద్వైతసంప్రదాయానికి సంబంధించిన అలాంటి ప్రకరణ గ్రంథాలలో బహుళప్రచారంలో ఉన్నది. వేదాంతసారం,
భారత సూక్తి శుధ్యబిందువులు Bharatha sookti Sudhabinduvulu
భారత సూక్తి శుధ్యబిందువులు Bharatha sookti Sudhabinduvulu
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో ప్రొఫెసర్గా, విభాగాధ్యక్షురాలుగా పని చేసిన డా. పి. శశిరేఖ గారు భారతం నుంచి దాదాపు 450 సూక్తులు సేకరించి. , “భారత సూక్తి సుధాబిందువులు” అను పేరుతో ప్రచురించినారు ప్రతిదివసము నందు భగవతార్ధనాది ప్రాతః కాలకర్తవ్యములు ముగించుకొని ఏతాదృశ సూక్తి సముచ్చయ – భగవద్గీతాదులలో ఏ ఒక్క గ్రంథం నుంచి యైనా నాలుగైదు శ్లోకాలు చదివి, వాటి అర్థం భావన చేస్తూ దైనందిన వ్యవహారోద్యుక్తులైనవారు, నిరంతరోత్సాహభరితులై నిరాశా నిస్పృహలకు లోను కాకుండా సుఖమైన జీవితాన్ని గడప గలరు.