పురాణవైర గ్రంథమాల 12 నవలలు Purana Vaira Granthamala
పురాణాల చారిత్రికతను తిరస్కరించే ధోరణిని విశ్వనాథ సత్యనారాయణ పురాణవైరమన్నారు. చారిత్రికాంశాలను పురాణాల నుంచి స్వీకరించి ఆయన పురాణవైర గ్రంథమాల రచించారు. ఈ నవలామాలిక లక్ష్యాలను పేర్కొంటూ ఆ లెక్క(పాశ్చాత్య చరిత్ర కారుల లెక్క) ప్రకారము కలి ప్రవేశము మొదలు- సంయుక్తా పృథ్వీరాజుల కథ దనుక, పాశ్చాత్యులు తారుమారు చేసిరి. ఆ కాలము, అనగా సుమారు మూడువేల యేండ్ల కాలము, మహమ్మదు గోరీ వచ్చువరకు మన చరిత్రలో పాశ్చాత్యులు చేసిన అవక తవకలు కాదని నవలల రూపమున నిరూపించుటకు చేసెడి ప్రయత్న మిది. అందుచేత దీనికి “పురాణవైరము” అని శీర్షిక ఏర్పరుపబడినది. అన్నారు విశ్వనాథ సత్యనారాయణ.
1. భగవంతుని మీది పగ ; 2. నాస్తికధూమము ; 3. ధూమరేఖ ; 4. నందోరాజా భవిష్యతి
5. చంద్రగుప్తుని స్వప్నము ; 6. అశ్వమేధము ; 7. అమృతవల్లి ; 8. పులిమ్రుగ్గు
9. నాగసేనుడు ; 10. హెలీనా ; 11. వేదవతి ; 12. నివేదిత