హిందూ ఈషాప్ బులెటిన్ – కార్తీక మాసం – యుగాబ్ద 5124
- November 21, 2022
- 0 Comment(s)
హిందూ ఈషాప్ బులెటిన్ – కార్తీక మాసం – యుగాబ్ద 5124
సర్ C . V రామన్ జయంతి (నవంబర్ 21 వ తేదీ) మరియు జగదీశ్ చంద్రబోస్ జయంతి (నవంబర్ 23 వ తేదీ) శుభాకాంక్షలతో …
హిందూ ఈషాప్లో కొత్త పుస్తకాలు
అడుగడుగున గుడి ఉంది
గుడి అంటే ఏమిటి?
మంటపం, ముఖద్వారం, గర్భగృహం, దేవుడు, ధ్వజస్తంభం …. గుడి అంటే ఇదేనా?
తీర్థం ప్రసాదం, అక్షింతలు, శఠగోపం…గుడి అంటే ఇదేనా…?
గుడి ఒక భావన… గుడి ఒక నిరంతరత… గుడి ఒక సజీవ సాక్ష్యం… గుడి ఒక చరిత్ర… గుడి మన భవిష్యత్తు….
అలాంటి ఒక గుప్పెడు గుడుల కథే….అడుగడుగున గుడి ఉంది…
భగవంతుడికి, భక్తుడికి, భక్తికి, వీటన్నిటినీ మించి నమ్మకానికి అంకితమైన పుస్తకం అడుగడుగున గుడి ఉంది.
కట్టిపడేసే చిత్రాలు, కథనంలో విచిత్రాలు ….అదే అడుగడుగున గుడి ఉంది…..
చదవండి…. చదివితే చదివించేస్తారు….కొనండి… కొంటే కొనిపించేస్తారు….
సర్వ దర్శన సంగ్రహము
ధర్మలన్నిటిలో గల సారాన్ని ఎదుట ఉంచితే మానవుల మనస్సులోఉన్న కల్లోల పరిస్థితి తొలగిపోతుంది. ఈ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఆనాడు ప్రపంచంలో ఉన్న
1. చార్వాక, 2. బౌద్ధ, ౩. ఆర్హత (జైన), 4. రామానుజ (విశిష్టాద్వైత), 5. పూర్ణప్రజ్ఞ (ద్వైత), 6. నకులీశపాశుపత, 7. శైవ, 8. ప్రత్యభిఙ్ఞ (కాశ్మీరశైవ), 9. రసేశ్వర, 10. ఔలూక్య (వైశేషిక), 11. అక్షపాద (న్యాయ) 12. జైమిని (పూర్వమీమాంస), 13. పాణిని, 14. సాంఖ్య, 15. పాతజఞ్జల 16. శాంకర అను పదహారు దర్శనాలను సంగ్రహంగా అందించారు సాయణ మాధవాచార్యులు. ‘న స్వర్గా నాపవర్లో’ (స్వర్గమూ లేదు, మోక్షమూ లేదు) అనే నాస్తికవాదంతో ఆరంభించి, ‘బ్రహ్మసత్యం జగన్మిధ్య’ (బ్రహ్మసత్యము, జగత్తుమిథ్య) అనే శంకరదర్శనం తో ఈ గ్రంథాన్ని ముగిస్తారు ఆచార్యులు. ఈ విధం దర్శన సుమాలను ఏరి, మాలగా కూర్చి ఆ పరమాత్మ గళసీమను అలంకరించి గొప్ప దార్శనికులు సాయణమాధవాచార్యులు. భారతీయ సంస్కృతికే శిరోభూషణం ఈ గ్రంథరాజం.
కొన్ని పుస్తకాలు – మీ కోసం
రక్త సిక్త భారతం
ఆవరణ
ఇది రచయిత భైరప్ప రెండో చారిత్రక నవల. ఎనిమిదవ శతాబ్దపు సంధికాలం అంతశ్శక్తిని ‘సార్థ’ నవలా రూపంలో ఆవిష్కరించడానికి రచయిత ప్రయత్నించారు. ‘ఆవరణ’లో ‘సార్థ’ తర్వాతి కాలం నాటి సత్యాన్ని చిత్రించడానికి పూనుకొన్నారు. భారతదేశ చరిత్రలో ఎంతో క్లిష్టమైన ఈ కాలం గురించి తెలుసుకొనేందుకు విపులసామగ్రి లభిస్తుంది. కాని ఆవరణశక్తి (సత్యాన్ని కప్పిపుచ్చే శక్తి) ఈ సమృద్ధ సామగ్రి కంటె ఎన్నో రెట్లు గొప్పది. ‘సార్థ’ నవల కాలంనాటి చరిత్ర ఆవరణశక్తికి ఎక్కువగా బలి కాకపోవడం గమనార్హం.
ఆ కాలపు చరిత్ర గురించి నిర్భయంగా సత్యాన్ని ప్రకటించవచ్చు. కాని ‘ఆవరణ’ నవల కాలం నాటి చరిత్ర గురించి అలా చెప్పలేం. అడుగడుగునా ఆవరణశక్తిని చీల్చుకొంటూ ముందుకు సాగవలసిన అనివార్య పరిస్థితులు ఎదురవుతాయి. అందువల్ల దానికి అనుగుణంగా నిర్మించుకున్న స్వరూప శిల్పము కలిగినది ఈ నవల. కన్నడ మాతృకని తెలుగులోనికి అనువదించినవారు శ్రీమతి అరిపిరాల సువర్ణ గారు.
స్ఫూర్తిపథం
శ్రీ భమిడిపల్లి సుబ్రహ్మణ్యశర్మగారు సంకలనం గావించిన ‘స్ఫూర్తిపథం’, వివిధ ఆర్షధర్మగ్రంథ తరువుల నుంచి సేకరించిన భావసుగంధ పుష్పగుచ్చం. ప్రతి శ్లోకానికి తెలుగు తాత్పర్యంతో సహా, చిన్న వివరణ ఇవ్వటం సముచితంగా ఉన్నది.. విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ విపులీకరణ ఉపకరిస్తుంది. జీవితాన్ని “అన్ని కోణాలనుంచి విశ్లేషించి, క్షుణ్ణంగా అర్థం చేసుకొని, తమ అనుభవాన్ని రంగరించి మన పూర్వీకులు మనకు అందించిన ధర్మసూక్తులు అనేకానేకం. వాటిలో అతిముఖ్యమైనవి, సమకాలీన ప్రపంచానికి అత్యవసరమైనవని భావించిన కొన్నింటిని శ్రీ శర్మగారు ఈ “స్ఫూర్తిపథం”లో కూర్చారు. లౌకిక జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్ధంగా ఎదుర్కోవడానికి ఈ సంకలనం చక్కగా ఉపకరిస్తుంది.
ఆధునిక భారతీయ వైజ్ఞానికులు : భారత భారతి
- నవంబర్ 21 వ తేదీ : సర్ C . V రామన్ జయంతి
- నవంబర్ 23 వ తేదీ : డా. జగదీశ్ చంద్రబోస్ జయంతి
ఈ సందర్భంగా హిందూ ఈ షాప్, వారికి నివాళులర్పిస్తోంది. భారత జాతికి వైజ్ఞానికులుగా వారు చేసిన సేవలను తెలుసుకుందాం – తలచుకుందాం, పిల్లలకి తెలియచేద్దాం.
12 ఆధునిక భారతీయ వైజ్ఞానికుల జీవితాన్ని పరిచయం చేసే ” భారత భారతి ” పుస్తకాల సెట్.
* శాంతి స్వరూప్ భట్నాగర్
* మేఘనాథ్ సాహా
* డా. ప్రఫుల్ల చంద్రరే
* నందలాల్ బోసు
* డా. సి. వి. రామన్
* డా. యం. విశ్వేశ్వరయ్య
* బీర్బల్ సహానీ
* సత్యేన్ద్రనాథ్ బోస్
* డా. జగదీశ చంద్రబోస్
* విక్రం సారాభాయ్
* శ్రీనివాస రామానుజం
* హోమీ బాబా