భారత దేశాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నాలు Bharatadeshanni Vichhinam chese prayatnalu

” Bharatadeshanni Vichhinam chese prayatnalu “is an abridged Telugu version of Breaking India written by Sri Rajeev Malhotra & Sri Aravindan Neelakanthan

100.00

1 in stock

Compare

Description

About the Book : 

భారత దేశాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నాలు

ప్రపంచంలోని కొన్ని పాశ్చాత్య దేశాలు, ప్రముఖ క్రైస్తవ సంస్థలు కలిసి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి , వారసత్వ సంపద కలిగిన భారతదేశాన్ని ముఖ్యంగా స్థానిక హిందువుల అస్తిత్వాన్ని, నాగరికతను, శాశ్వితంగా అంతమొందించాలి అనే స్పష్టమైన లక్షం కుట్ర తో  పని చేస్తున్న సంస్థలు, వారి కార్యకలాపాలను ఈ పుస్తకంలో కొంత వివరించడం జరిగింది.  క్రైస్తవులు, క్రైస్తవేతరులు అంటూ ప్రపంచాన్ని విభజించి, ఆఫ్రికాలోని ప్రజలను నల్ల జాతీయులు, అనాగరికులు అని ముద్రించి వారిని ఉద్ధరించే పని కేవలం క్రైస్తవులదే అనే భావించే కొన్ని శక్తులు, అదే తరహాలో భారత దేశం సమాజంలోని వైవిధ్యాన్ని విభజనకు పునాదిగా మలచుకుంటూ చేస్తున కుట్రను బహిరంగ పరిచిన పుస్తకం ఇది.

ప్రధానంగా దేశంలో చిన్న పెద్ద యూనివర్సిటీలను ఆధారంగా చేసుకొని సమాజంలోని వివిధ వర్గాలను దళితులు అని ముద్రించి, కొన్ని సంఘటనలు కేంద్రంగా చేసుకొని దళిత సాహిత్యం, అధ్యయన శాఖలు ఏర్పరిచి వాటి కేంద్రంగా విభజన బీజాలు వేయడం. అదే ప్రణాళికలో భాగంగా తమ కనుసన్నల్లో పనిచేసే వారిని మేధావులు, విద్యావంతులుగా ప్రచారం చేసి, ధన సహాయం, విదేశీ పర్యటనలు ఏర్పాటుచేయడం. క్రమబద్ధంగా కొన్ని దేశ, రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు పరోక్ష్యంగా సహాయ సహకారాలు అందివ్వడం. అందుకు కావలిసిన సంస్థలు, వ్యక్తులు, చర్చ్ నెట్వర్క్ ను అంతర్గంతంగా సహాయ సహకారాలు అందించుకొని వారి లక్షమైన దేశాన్ని విచ్చినకరం చేయడం లో భాగస్వాములు చేయడం మనం ఇందులో తెలుసుకోవచ్చు. అంతర్జాతీయ సంస్థల నివేదికలను తమకు అనుకూలంగా ముద్రించి భారత దేశం వ్యవస్థల పై దాడి చేయడం, సమాజాన్ని కించ పరచడం, అవమాన పరుస్తూ ఒక ఆత్మ న్యూనత భావాన్ని కలిగించే విధమైన వాతావరణాన్ని సృష్టించే కుట్ర ను ఇందులో మనం తెలుసుకోవచ్చు.

దేశంలో ద్రావిడ జాతి వాదం, దళిత వాదం, ద్రావిడ క్రైస్తవ వాదం, ఉదారవాదం, ఆఫ్రో దళిత వాదం, స్వేచ్చా వాదం, మత స్వేఛ్చ, ఆర్యులు, ద్రవిడులు, పాశ్యాత్య సంస్కృతే ఆదర్శమైనది అని ప్రచారం చేయడం.  దేశాన్ని మోఘిలిస్తాన్, దళితస్తాన్, ద్రవిడస్తాన్, చర్చ్ రాజ్యాలు గా విచ్చిన చేయడానికి పాశ్చాత్య  దేశాలు ఏ విధంగా జోక్యం చేస్తున్నాయో సంక్షిప్తంగా వివరించిన పుస్తకం.  రాజీవ్ మల్హోత్రా ,  అరవిందన్ నీలకంఠన్ కొన్ని దశాబ్దాల పాటు క్షుణ్ణంగా పరిశోధించి రాసిన పుస్తకం ‘బ్రేకింగ్ ఇండియా'(ఇంగ్లీష్).  దాని తెలుగు అనువాదమే “భారత దేశాన్ని విచ్చినం చేసే ప్రయత్నాలు”. ఇది పాఠకులకు సులభంగా అర్ధం కావడానికి అంశాల ఆధారంగా 19 అధ్యాయాలుగా వివరించడం దాదాపు 250 పేజి లలో సంక్షిప్తంగా అందివ్వడం జరిగింది.

” Bharatadeshanni Vichhinam chese prayatnalu “is an abridged Telugu version of Breaking India written by Sri Rajeev Malhotra & Sri Aravindan Neelakanthan

Authors :

  • రాజీవ్ మల్హోత్రా ,  అరవిందన్ నీలకంఠన్
  • తెలుగు అనువాదకులు – శ్రీ ఏ వి పద్మాకర్ రెడ్డి,  శ్రీ కాకాని చక్రపాణి , శ్రీ డి. చంద్రశేకర రెడ్డి.

 

ISBN- 978-93-83652-77-8 ; Publishers -Emmesco;   Pages- 254 .

Author

Aravindan Neelakandan

Rajiv Malhotra

Reviews

There are no reviews yet.

Be the first to review “భారత దేశాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నాలు Bharatadeshanni Vichhinam chese prayatnalu”

Select at least 2 products
to compare