Description
1925లో స్థాపించబడిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అనేక అటుపోటులను భరించి, నిరంతరంగా కృషి చేస్తున్నందున ఈనాడు అందరి దృష్టిని ఆకర్షించేదిగా ఉంది. సంఘం యొక్క విశిష్టతను ఒప్పుకుంటూ కూడా దానికి దూరంగా ఉండటమే మంచింది అనుకునేవారు కొందరుంటారు. సంఘాన్ని గురుంచి కొన్ని భ్రమలు, ఎవరో కల్పించిన దుర్భావనలు ఇందుకు కారణమై ఉండవచ్చు.
ఇటువంటి భ్రమలను, అపప్రచారజనిత దుర్భావనలను తొలగించే నిమ్మిత్తంగా 2018 సెప్టెంబర్ 17, 18, 19 తేదీలలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ప్రబుద్ధ నాగరికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ మూడు రోజుల ఉపన్యాసాలలో వివిధ సామాజిక అంశాలపై సంఘ దృష్టి కోణాన్ని తెలియపరుస్తూ చేసిన వ్యాఖ్యానాల సంకలనం ఈ పుస్తకం.
ఈ పుస్తకం ద్వారా చర్చ మరింత కొనసాగి భారతదేశం పట్ల మనందరిలోనూ స్పష్టమైన, సమాన అవగాహన ఏర్పడి భారత్ ఉజ్జ్వల భవిష్యత్తు వైపు సాగే దిశ, ప్రేరణ అందుతాయని పుస్తక ప్రచురణకర్తల ఆకాంక్ష.
Reviews
There are no reviews yet.